

Apple | యాపిల్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ఏ కంపెనీ సాధించని మైలురాయిని యాపిల్ తాకింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ సోమవారం 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
పబ్లిక్ ట్రేడ్ చేస్తూ ఈ ఘనత సాధించిన తొలి కంపెనీ యాపిల్ కావడం విశేషం. యాపిల్ కొవిడ్ టైంలో అధిక విక్రయాలను నమోదు చేసింది. ఈ మేరకు కంపెనీ నివేదికలో ప్రకటించింది.
గతేడాది కరోనా కారణంగా ఎక్కువ శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయడంతో యాపిల్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. యాపిల్ 2018 ఆగస్టు నాటికి 1 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది.
అదే విధంగా 2020 ఆగస్టు నాటికి 2 ట్రిలియన్ డాలర్ల మార్క్ను దాటింది. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్ల మార్క్కు అతి చేరువలో ఉందని కంపెనీ అధికారులు తెలిపారు.
# apple# business# public trade