

విశాఖ పట్నంలో దారుణం చోటుచేసుకుంది. నాగుల చవితి సందర్భంగా నిర్వహించిన నేలవేషాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంటతో ఫీట్స్ చేస్తున్న కళాకారుడిని ఆ మంటలే ముంచేశాయి. ఈ ఘటన విశాఖపట్నం యలమంచిలలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నేలవేషాల సందర్భంగా సంతోష్ అనే వ్యక్తి ఫైర్ బ్రీత్ను ప్రదర్శిస్తున్నాడు. డీజిల్ను నోట్లో పోసుకొని అతడు ఈ ఫీట్ చేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా గాలి ఎదురురావడంతో మంటలు అతడిపైకే వచ్చాయి. దాంతో అతడు ప్రమాదానికి గురయ్యాడు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంతోష్ ప్రస్తుతం కాలిన గాయాలకు చికిత్స అందుకుంటున్నాడు.